అక్కినేని బయోపిక్ పై నాగార్జున స్పందన..!

  • January 24, 2019 / 10:41 AM IST

అఖిల్ నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ మజ్ను’ ప్రపంచ వ్యాప్తంగా జనవరి 25 న (రేపు) విడుదల కాబోతుంది. వరుణ్ తేజ్ తో ‘తొలిప్రేమ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కింది. ‘శ్రీ వెంకటేశ్వర చలన చిత్ర’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో ‘సవ్యసాచి’ ఫేమ్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతంలో తెరకెక్కిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగార్జున …. ఏఎన్నార్ బయోపిక్ గురించి స్పందించారు.

నాగార్జున మాట్లాడుతూ… “అక్కినేని నటించిన సినిమాలు రీమేక్ చేయడానికే మేము భయపడుతుంటాము. అలాంటిది ఆయన బయోపిక్ ను తీసే సాహసం చేయగలమా..! నాన్నగారికి ఘన నివాళిగా అందించే బయోపిక్ కనుక పరాజయం పాలైతే మేము అస్సలు తట్టుకోలేము…” అంటూ ఏఎన్నార్ బయోపిక్ తీసే ఉద్దేశం తమకి ఎంతమాత్రం లేదని స్పష్టం చేశాడు. మొద అక్కినేని బయోపిక్ తీయాలనే ఉద్దేశం.. నాగార్జునకు లేదంట. అయితే తన కుటుంబ సభ్యులతో చర్చించి .. మనసు మార్చుకున్నారనే ప్రచారానికి ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశారు. ‘ఎన్టీఆర్ బయోపిక్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో…. నాగార్జున తన తండ్రి బయోపిక్ తెరకెక్కించడానికి భయపడుతున్నారని.. ఇటు ఫిలింనగర్లోనూ.. అటు సోషల్ మీడియాలోనూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus