వైకుంఠపురములో బ్లాక్ బస్టరట..!

  • January 7, 2020 / 05:45 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, కె. రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా చాలా క్లాస్ గా ఉందని అంటున్నారు. మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు. సెకండ్ హాఫ్ పూర్తిగా తండ్రి, కొడుకుల సెంటిమెంట్ తో నిండి ఉంటుందని.. అది గనుక వర్కవుట్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని చెబుతున్నారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉందని టాక్. అయితే బి,సి సెంటర్లు ఆశించే మసాలా పెద్దగా లేకపోవడంతో అక్కడ ఏ స్థాయిలో వర్కవుట్ అవుతుందా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి!

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus