చివరికి దిగొచ్చిన బన్నీ, మహేష్ నిర్మాతలు..!

  • November 9, 2019 / 06:48 PM IST

ఎన్నడూ లేని విధంగా ఇద్దరు పెద్ద హీరోలు తమ సినిమాల్ని ఒకే రోజు విడుదల చేస్తున్నట్టు ప్రకటించడంతో ప్రేక్షకులందరికీ పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. ఆ సినిమాలే.. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’..! రెండు సినిమాలకి మంచి బజ్ ఉంది. రెండూ సంక్రాంతికే విడుదల కాబోతున్నాయి. అయితే రెండూ జనవరి 12నే విడుదల చేస్తున్నట్టు ప్రకటించడంతో డిస్ట్రిబ్యూటర్స్ లో ఆందోళన నెలకొంది. ఒకేరోజు రెండు సినిమాలు వస్తే గనుక మొదటి రోజు ఓపెనింగ్స్ పై పెద్ద దెబ్బె పడే అవకాశం ఉంటుంది.

దీంతో రెండు సినిమాలు నిర్మాతలు మీట్ అయ్యి చివరికి ఓ మాటకి వచ్చారట. దీంతో ఒకరు ఒక రోజు ముందుకు రావడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం జనవరి 11 న విడుదల కాబోతుందని.. ఇక అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమా జనవరి 12న విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఓ పెద్ద సమస్య తీరినట్టే అని డిస్ట్రిబ్యూటర్లు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారట. ఇక ఈ విషయం పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus