అదే జూన్ 15లోగా సినిమాను రిలీజ్ చేసుకోండి. దాని కోసం ఏర్పాట్లు చేసుకోండి అంటూ మద్రాసు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏర్పాట్లు చేసిన దర్శకనిర్మాత గౌతమ్ వాసుదేవ్ మీనన్ గత కొన్ని నెలలుగా ఈ మేరకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఆ డేట్ను ఇప్పుడు అక్టోబరు 31, 2026లోపు సినిమాను రిలీజ్ చేస్తామని కోర్టుకు తాజాగా తెలియజేశారు.
సినిమాను ఆ డేట్లోగా రిలీజ్ చేయడానికి, ఆ మేరకు డబ్బులు పెట్టడానికి ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నారు అని గౌతమ్ వాసుదేవ్ మీనన్ మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. అయితే ఈ లోపు హీరో విక్రమ్కు ఇవ్వాల్సిన రూ.10.57 కోట్లు ఇచ్చినట్లు ఆధారాలు కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ సినిమా ఎట్టకేలకు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘కొండాడువోమ్ ఎంటర్టైన్మెంట్’ అనే సంస్థ పేరిట బ్యాంకు ఖాతాను తెరవాలని గత తీర్పు సందర్భంగా హైకోర్టు సూచించింది. ఈ సినిమాకు సంబంధించిన లావాదేవీలను ఆ ఖాతా ద్వారానే జరగాలని ఆదేశించింది. ఈ వ్యవహారాలను ఓ న్యాయవాది పర్యవేక్షిస్తారని తెలిపింది. ఇప్పుడు టీమ్ అదే పని చేస్తోంది. 2016లో ప్రారంభమైన ‘ధృవనక్షత్రం’/ ‘ధృవ నటచిత్రం’ సినిమాను 2017లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు దర్శకుడు గౌతమ్ మీనన్.
కానీ ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఒక సమయంలో గౌతమ్ మీనన్, విక్రమ్ చాలా భావోద్వేగానికి కూడా గురయ్యారు. ఇక 2023లో ఈ సినిమాకు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. శింబు హీరోగా గౌతమ్ మీనన్ ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఒప్పందం కుదుర్చుకుని రూ.2.40 కోట్లు తీసుకున్నారని.. కానీ సినిమాను పూర్తి చేయలేదని ఫిర్యాదు వచ్చింది.
తమ డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆల్ ఇన్ పిక్చర్స్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. నగదు తిరిగి ఇవ్వకుండా ‘ధృవ నక్షత్రం’ సినిమా విడుదల చేసే అవకాశం ఇవ్వొద్దు అంటూ ఆల్ ఇన్ పిక్చర్స్ కోరింది. అప్పటి నుండి మళ్లీ సినిమా పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది.