Allu Arjun, Krish: మరోసారి రిపీట్ కాబోతున్న అల్లు అర్జున్ క్రిష్ కాంబినేషన్!

  • September 28, 2023 / 08:30 PM IST

ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సీక్వెల్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చేయడాది ఆగస్టు 15వ తేదీ విడుదల కాబోతుంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నటువంటి అల్లు అర్జున్ వరుస సినిమాలకు కూడా కమిట్ అవుతున్నారు. ఈ క్రమంలోని ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా మూవీని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. పుష్ప సినిమా షూటింగ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

ఇదిలా ఉండగా అల్లు అర్జున్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరొక సినిమా కూడా చేయబోతున్నారని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి సినిమా పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోస్టర్స్‌లో అల్లు అర్జున్ రెండు డిఫరెంట్ గెటప్‌లలో కనిపిస్తున్నాడు. ఒకటి క్లాస్‌, మరొకటి మాస్ లుక్ లతో అతడి ముఖం సగం..సగం మాత్రమే కనిపించేలా డిజైన్ చేశారు.

ఇక ఈ సినిమాకు కభీ అప్నే కభీ సప్నే అంటూ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా ఈ పోస్టర్ చూస్తేనే అర్ధం అవుతుంది. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వేదం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

మంచు మనోజ్ అనుష్క అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ఈ సినిమా అప్పట్లో పలు విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది. ఇలా ఈ సినిమా తర్వాత మరోసారి క్రిష్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఈ సినిమా రాబోతుందని వెల్లడించారు. అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను తెలియజేయనున్నట్లు సమాచారం. ప్రస్తుత అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus