అక్కడ ‘అల వైకుంఠపురములో’ కలెక్షన్స్ అదిరిపోయాయి..!

  • January 13, 2020 / 06:37 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తోనే ఈ చిత్రం 800K డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టి ఆల్ టైం రికార్డు సృష్టించింది.

ఈ సంక్రాంతికి మొదట విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం 759K డాలర్లను వసూల్ చేసింది.అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి 20 డాలర్ల టికెట్ రేట్ అయితే… ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి టికెట్ రేటు కేవలం 14 డాలర్లు మాత్రమే..! అయినప్పటికీ మహేష్ రికార్డు ను బ్రేక్ చేసింది. త్రివిక్రమ్ సినిమాలకు ఓవర్సీస్ లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి.. ఆ ఫీట్ సాధ్యమైందని చెప్పుకోవచ్చు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus