Amitabh Bachchan: ఒప్పందం రద్దు చేసుకున్నా.. టెలికాస్ట్ చేస్తున్నారు!

  • November 22, 2021 / 03:30 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ పాన్ మసాలా యాడ్ లో కనిపించడంపై విమర్శలు వచ్చాయి. ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియాలో నిలదీశారు. మొదట్లో దాన్ని సమర్ధించుకున్న అమితాబ్.. ఆ తరువాత వెనక్కి తగ్గారు. కానీ అప్పటికే యాడ్ కి సంబంధించిన షూటింగ్ అయిపోయింది. సదరు సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లుగా అమితాబ్ ప్రకటించుకున్నారు. కానీ టీవీలో మాత్రం అమితాబ్ యాడ్ ప్రసారమవుతూనే ఉంది. ఇండియా, న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్ ల

సందర్భంగా ఓవర్ల మధ్యలో యాడ్స్ లో అమితాబ్ నటించిన కమలా పసంద్ యాడ్ ను క్రమం తప్పకుండా ప్రసారం చేశారు. ఈ విషయంలో అమితాబ్ గగ్గోలు పెట్టారు. ఆ యాడ్ ప్రసాన్ని వెంటనే ఆపాలంటూ ఆ కంపెనీకి నోటీసులు పంపించారట. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా ఆ యాడ్ ను యధాతధంగా ప్రసారం చేశారు. ఆ యాడ్ లో అమితాబ్ తో పాటు రణవీర్ సింగ్ కూడా కనిపిస్తాడు.

ఒప్పందం క్యాన్సిల్ చేసుకున్నట్లుగా అమితాబ్ ప్రకటించి చాలా రోజులైంది కానీ సదరు కంపెనీ మాత్రం.. అమితాబ్ రిక్వెస్ట్ ను ఏ మాత్రం లెక్క చేయకుండా యాడ్ ను ప్రసారం చేస్తూనే ఉంది. మరి ఈ విషయంలో అమితాబ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus