25 నిమిషాల పాత్రకే ఇక్కడి స్టార్ హీరోకి ఇచ్చినంత ఇస్తున్నారుగా..!

  • October 14, 2020 / 06:07 PM IST

ప్ర‌భాస్ 21వ చిత్రాన్ని నాగ అశ్విన్ డైరెక్ట్ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ‘వైజ‌యంతీ మూవీస్’ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని 500కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక ప‌దుకొణె.. ప్రభాస్ కు జంటగా నటించబోతుంది. ఇక సినిమాలో అత్యంత కీల‌క‌మైన పాత్ర కోసం అమితాబ్ బ‌చ్చ‌న్ ను కూడా తీసుకున్నట్టు ఈ మధ్యనే చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు. అయితే ఈ ఇద్దరు బాలీవుడ్ స్టార్లకు ఎంతెంత పారితోషికాలు ఇస్తున్నారు? అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

దీపిక‌కు రూ.8కోట్ల నుండీ రూ.10 కోట్ల వరకూ ఇస్తున్నారని ఇన్సైడ్ టాక్. ఇక అమితాబ్ కు కూడా భారీ గానే ఇస్తున్నారని తెలుస్తుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ పాత్ర 25 నిమిషాలు నిడివి కలదని టాక్ ‌. ఆ మాత్రం దానికే 25 కోట్ల వరకూ అమితాబ్ కు ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అంటే తెలుగులో ఓ స్టార్ హీరోకి ఇచ్చినట్టు ఇస్తున్నారన్న మాట. అయితే ఈయనకు అంత ఇవ్వాల్సిన పనిలేదు అన్నది కొందరి వాదన. గతేడాది ‘సైరా నరసింహరెడ్డి’ వంటి చిత్రంలో అమితాబ్ నటించినప్పటికీ.. ఆ చిత్రం బాలీవుడ్లో 10కోట్ల షేర్ ను కూడా కలెక్ట్ చెయ్యలేదు. అందుకే వారిలా కామెంట్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

పైగా అమితాబ్ పార్ట్ ను ఆయనకు అనుకూలంగా ముంబైలోనే జరుపుతామని చిత్ర బృందం హామీ ఇచ్చారట. అంత తగ్గాల్సిన అవసరమేంటి.. సౌత్ లోనే చాలా మంది మంచి నటులు ఉన్నారు కదా అని ఇండస్ట్రీలో గుసగుసలు కూడా మొదలయ్యాయి. నిజంగా అమితాబ్ కు 25 కోట్లు ఇస్తున్నారా? లేక ఇది ఫేకేనా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నవారు కూడా లేకపోలేదు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus