హాట్ యాంకర్ కి అరుదైన గౌరవం!

  • February 11, 2021 / 03:55 PM IST

బుల్లితెరపై హాట్ యాంకర్ గా దూసుకుపోతున్న అనసూయ నటిగా కూడా రాణిస్తోంది. ‘క్షణం’, ‘రంగస్థలం’ లాంటి చిత్రాల్లో నటించి తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు సైన్ చేస్తూ బిజీగా మారింది. ఇదిలా ఉండగా.. ఈ బీయూటీకి అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్ ఆమెని తన సొంత పోస్టల్ స్టాంప్ తో సత్కరించింది. అంతేకాకుండా.. అనసూయ ఫోటోకి ఎర్రకోటని జోడించింది. ఈ విషయాన్ని అనసూయ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

తన ఫొటోతో ఉన్న పోస్టల్ స్టాంప్స్ ని షేర్ చేస్తూ.. ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది. జీవితంలో ఇంతకుమించి గౌరవం ఉండదని.. ఇందుకు అర్హురాలు అయ్యేందుకు ఏం చేశానో కూడా తెలియదని అన్నారు. ఈ గౌరవం ఇవ్వకముందే నుండే చిత్రపురి ఫిలిం ఫెస్టివల్ పై ఎంతో గౌరవం ఉండేదని.. ప్రోత్సహించడానికి వారు గొప్ప ప్రయత్నం చేస్తున్నారని.. ఇలాంటి గొప్ప పనులు చేయడం కోసం తన వంతు చేయగలిగినంత చేస్తానని ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చారు.

ఈ ఏడాది మహిళా దినోత్సవము సందర్భంగా స్ఫూర్తిని నింపే ఎంతోమంది మహిళల ఘనతకు సంబంధించిన కథలను చిత్రపురి ఫిలిం ఫెస్టివల్ వెల్లడించనుంది. అయితే అనసూయకి ఇలాంటి గౌరవం లభించడంతో ఆమె అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకి శుభాకాంక్షలు చెబుతున్నారు.


Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus