Shyamala: ఎవరి అభిమానం వారిది.. యాంకర్ శ్యామల కామెంట్స్ వైరల్!

  • June 7, 2024 / 09:17 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ యాంకర్లలో యాంకర్ శ్యామల (Shyamala) ఒకరు కాగా శ్యామలకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. యాంకర్ శ్యామల కొన్ని సినిమాల్లో నటించగా ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో యాంకర్ శ్యామల వైసీపీ తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని శ్యామల కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో తన గురించి విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

ఎవరు ఇబ్బందులకు గురి చేసినా తాను ఇప్పటివరకు కొనసాగిన పార్టీలోనే నేను కొనసాగుతానని శ్యామల పేర్కొన్నారు. నా గురించి వస్తున్న ట్రోల్స్ ను సైతం నేను పట్టించుకోనని ఆమె చెప్పుకొచ్చారు. ఎవరు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా తాను జగన్ వెంట నడుస్తానని ఈ విషయంలో తాను ట్రోల్స్ ను పట్టించుకోనని శ్యామల పేర్కొన్నారు. తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ టార్గెట్ చేసి కామెంట్లు అయితే చేయలేదని ఆమె తెలిపారు.

నేను వ్యక్తిగతంగా ఎవరినీ దూషించలేదని ఆమె తెలిపారు. ఎవరి అభిమానం వాళ్లదని పార్టీ అప్పగించిన డ్యూటీ మాత్రమే నేను నిర్వర్తించానని శ్యామల తెలిపారు. భవిష్యత్తులో తాను పని చేసిన పార్టీ కోసం మరింత కష్టపడతానని ఆమె చెప్పుకొచ్చారు. శ్యామల కామెంట్లతో ఇకపై ట్రోల్స్ చేసేవాళ్లు సైలెంట్ అవుతారేమో చూడాల్సి ఉంది. శ్యామల సినిమాలు, ఈవెంట్లతో కెరీర్ పరంగా బిజీ అయితే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

శ్యామల రెమ్యునరేషన్ సైతం పరిమితంగా ఉందని సమాచారం అందుతోంది. రాజకీయాలతో సంబంధం లేకుండా శ్యామలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. శ్యామల కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. శ్యామల విభిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus