మోహన్ లాల్ సినిమాలో అవకాశం దక్కించుకొన్న అనీషా!

  • May 10, 2016 / 01:00 PM IST

మెగా ఫ్యామిలీ హీరో అయిన వెంకట్ రాహుల్ సరసన “అలియాస్ జానకి” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనీషా ఆంబ్రోస్.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన నటించే అరుదైన అవకాశం సొంతం చేసుకొని అందర్నీ ఆకర్షించింది. ఆ తర్వాత ఆమె స్థానంలో కాజల్ ను తీసుకొన్నారు. అది వేరే విషయం అనుకోండి.

ఇటీవల సందీప్ సరసన నటించి “రన్” అనే ఫ్లాప్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకొన్న అనీషా.. మరో భారీ సినిమా ఆఫర్ ను దక్కించుకొన్నట్లు తెలుస్తోంది. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో చంద్రసేకర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “మనమంతా” చిత్రంలో అనీషాను కథానాయికగా ఎంపిక చేసుకొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ హైద్రాబాద్ లో జరుగుతోంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus