హీరో జై తో ఎఫైర్… పై అంజలి కామెంట్స్!

  • February 6, 2019 / 08:26 AM IST

‘ఫోటో’ చిత్రంతో ప్రేక్షకులకి పరిచయమయ్యింది అంజలి. అయితే ఆ చిత్రం అంజలికి ఏమాత్రం గుర్తింపు తీసుకురాలేదు. ఒక విధంగా ఆ చిత్రం విడుదలైనట్టు కూడా చాలా మందికి తెలీదు. దీంతో ఆమెకు తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు. ఇక చేసేదేమీ లేక కోలీవుడ్ వైపు మళ్ళింది. అక్కడ ‘షాపింగ్ మాల్’,’జర్నీ’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘జర్నీ’ చిత్రంలో తన నటనకి.. తెలుగు ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారనే చెప్పాలి. తెలుగమ్మాయిగా అంజలి తమిళ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ‘మసాలా’ ‘గీతాంజలి’ ‘శంకరా భరణం’ ‘డిక్టేటర్’ వంటి తెలుగు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ఆమె మలయాళ స్టార్ హీరో మమ్ముట్టితో కలిసి ‘పెరంబు’ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి గానూ విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది.

ఇక ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది అంజలి. ఇందులో ఆమెకి తన ప్రేమ, పెళ్ళి అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాదానాలు ఇచ్చింది. ‘జర్నీ’ చిత్ర టైములో హీరో జై తో అంజలి ప్రేమాయణం మొదలైందని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పై అంజలి ఎప్పుడూ స్పందించలేదు. కానీ తాజాగా ఈ విషయం పై అంజలి ఓపెన్ అయింది. అంజలి ఈ విషయం పై ప్రస్తావిస్తూ.. ‘అసలు జై తో తన అనుబంధం గురించి తను ఎక్కడా చెప్పలేదని… మీడియానే ఏదేదో ఊహించుకొని తమ చుట్టూ ప్రేమ కథ అల్లేసిందని దానికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం తనకు లేదని వెల్లడించింది. అప్పట్లో ఇలాంటి గాసిప్స్ వచ్చినప్పుడు తెగ బాధ పడిపోయి ఏడ్చేదాన్నని… ఇప్పుడు మాత్రం అసలు పట్టించుకోకుండా కెరీర్ మీద దృష్టి పెడుతున్నానని స్పష్టం చేసింది. ఇక పెళ్ళి గురించి ఆలోచించే టైం కూడా లేదని’ చెప్పుకొచ్చింది మన సీతమ్మ..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus