Anu Emmanuel Remuneration: క్రేజ్ తగ్గినా.. అను ఇమ్మాన్యుయేల్ బాగానే అందుకుంటుంది..!

  • June 19, 2021 / 12:12 PM IST

టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వడమే నాని వంటి క్రేజీ హీరో సినిమాలో నటించిన అను ఇమ్మాన్యుయేల్.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుని స్టార్ హీరోయిన్లకు సైతం షాకిచ్చింది. నాని తో ‘మజ్ను’ , విశాల్ తో ‘డిటెక్టివ్’, గోపీచంద్ తో ‘ఆక్సిజన్’, పవన్ కళ్యాణ్ తో ‘అజ్ఞాతవాసి’, అల్లు అర్జున్ తో ‘నా పేరు సూర్య’, నాగ చైతన్యతో ‘శైలజారెడ్డి అల్లుడు’ క్రేజీ చిత్రాల్లో ఈమె నటించింది. అయితే ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు.

పైగా ఈ అమ్మడి పై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. దీంతో చాలాకాలం పాటు ఈమెకు అవకాశాలు రాలేదు. అయితే ఈ ఏడాది ‘అల్లుడు అదుర్స్’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ‘మహాసముద్రం’ సినిమాలో కూడా ఓ హీరోయిన్ గా నటిస్తుంది.శర్వానంద్,సిద్దార్థ్ లు హీరోలుగా నటిస్తున్న.. ఈ చిత్రంలో ఆమె పాత్ర కోసం మంచి పారితోషికమే అందుకుందట.అందుతున్న సమాచారం ప్రకారం.. ‘మహాసముద్రం’ కు గాను అను రూ.45 లక్షల పారితోషికం తీసుకుందట.

ఈ సినిమా కనుక హిట్ అయితే ఈమెకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయం అనే చెప్పాలి. ఇక అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత అనిల్ సుంకర తన ‘ఎ.కె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా…అదితి రావు హైదరి మరో హీరోయిన్ గా నటిస్తుంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus