గోపిచంద్ తో కలిసి యాక్షన్ మూవీ చేయనున్న అనుష్క

  • May 17, 2018 / 07:32 AM IST

బహుబలి చిత్రాల తర్వాత అనుష్క వేగం తగ్గించింది. భాగమతి ఒక సినిమా మాత్రమే చేసింది. ఈ ఏడాది జనవరిలో రిలీజ్ అయిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. అరుంధతి, రుద్రమదేవి సరసన ఈ సినిమా చేరింది. ఆ తర్వాత కూడా ఏ ప్రాజక్ట్ కి ఒకే చెప్పలేదు. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. పెళ్లి చేసుకోబోతోందని పుకార్లు వచ్చాయి. అయితే ఆమె తాజాగా ఓ తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

డైరక్టర్ జయేంద్ర చెప్పిన యాక్షన్ కథకి ఒకే చెప్పినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ప్రస్తుతం ఇతను నందమూరి కల్యాణ్ రామ్, తమన్నా జంటగా “నా నువ్వే” సినిమాని తెరకెక్కించారు. ఇది ఈ నెలలో రిలీజ్ కాబోతోంది. దీని తర్వాత గోపిచంద్, అనుష్క మూవీని పట్టాలెక్కించనున్నారు. అనుష్క, గోపిచంద్ తో కలిసి శౌర్యం సినిమాలో కలిసి నటించింది. పదేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ యావరేజ్ చిత్రంగా నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ జోడీ కట్టబోతున్నారు. కిరణ్ ముప్పవరపు, విజయ సంయుక్తంగా నిర్మించనున్న ఈ మూవీ పనులు త్వరలోనే మొదలుకానున్నాయి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus