రానా-అనుష్క ల మధ్య బాక్సాఫీస్ వార్

  • February 10, 2020 / 07:22 PM IST

ఎప్పటినుండో వార్తలలో నడుస్తున్న రానా దగ్గుబాటి భారీ చిత్రం హాథీ మేరా సాథీ. హిందీ మరియు తెలుగు,తమిళ భాషలలో విడుదల కానున్న ఈ చిత్ర విడుదల తేదీ నేడు సడన్ గా ప్రకటించారు. వేసవి కానుగా ఏఫ్రిల్ 2న ఈ చిత్రం మూడు భాషలలో పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతుంది. ఇక తెలుగు లో ఈ చిత్రానికి అరణ్య అనే టైటిల్ పెట్టారు. విష్ణు విశాల్, పుల్కిత్ సామ్రాట్, శ్రియా పిలగోన్కర్ వంటి వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఎరోస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రభు సాల్మాన్ దర్శకత్వం వహిస్తున్నారు.

కాగా రానా దగ్గుబాటి అరణ్య విడుదల ప్రకటనతో పోటీ రసవత్తరంగా మారింది. అదే తారీఖున అనుష్క శెట్టి నటించిన సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ నిశ్శబ్దం విడుదల అవుతుంది. ఈ చిత్రం కూడా తెలుగుతో పాటు హిందీ, తమిళంలో విడుదల అవుతుంది. కాబట్టి రానా, అనుష్క బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నారు. నిశ్శబ్దం చిత్రాన్ని హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తుండగా, కోనా వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మాధవన్ తో పాటు, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజ్ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ నటిస్తున్నారు. ఇక ఏఫ్రిల్ 2వ తేదీనే నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ మరియు డెబ్యూ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన కూడా విడుదల కానున్నాయి. ఇన్ని చిత్రాలకు థియేటర్స్ దొరికే ఆస్కారం లేని పక్షంలో ఇందులో ఒకటో రెండో సినిమాలు వాయిదా పడే అవకాశం కలదు.

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus