Pawan Kalyan: పవన్ మూవీపై ఏపీ స్పీకర్ ఏమన్నారంటే?

  • September 6, 2021 / 04:04 PM IST

వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఓటీటీలో, బుల్లితెరపై కూడా ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. పింక్ మూవీకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కినా తెలుగు నేటివిటీకి తగిన విధంగా ఈ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేశారు. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ రోల్ లో నటించగా అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలో ఏపీ ప్రభుత్వం కొత్త జీవోను అమలులోకి తీసుకొచ్చి టికెట్ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాటు కరోనా సెకండ్ వేవ్ వల్ల పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న వకీల్ సాబ్ కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదు. అయితే తాజాగా ఏపీ స్పీకర్ వకీల్ సాబ్ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వకీల్ సాబ్ సినిమా చూస్తుంటే తనకు అప్పయ్య దొర గుర్తుకు వచ్చారని తమ్మినేని సీతారాం వెల్లడించారు.

అప్పయ్య దొరకు వకీల్ సాబ్ మూవీని అంకితం చేయవచ్చని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. వకీల్ సాబ్ మూవీలో పవన్ క్యారెక్టర్ లా అప్పయ్య దొరలో పోరాటం చూశానని తమ్మినేని సీతారాం వెల్లడించారు. ఏపీ స్పీకర్ పవన్ సినిమా గురించి పాజిటివ్ కామెంట్లు చేయడం గమనార్హం. ఏపీ స్పీకర్ చేసిన కామెంట్లను పవన్ ఫ్యాన్స్ నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. దిల్ రాజు వకీల్ సాబ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus