బాలయ్య గట్టిగా ఫైర్ అయ్యదండోయ్..!

  • May 28, 2020 / 06:25 PM IST

ఈరోజు నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి. ఇప్పుడు లాక్ డౌన్ వల్ల షూటింగులు అన్నీ నిలిచిపోయాయి. దీంతో ఎన్నో వందల కోట్ల రూపాయలు.. సినీ ఇండస్ట్రీ నష్టపోయింది అంటూ టాక్ వినిపిస్తుంది. ఇంకా నాలుగో లాక్ డౌన్ కొనసాగుతుంది.. ఇది ముగిసిన తర్వాత అయినా.. షూటింగ్ లు తిరిగి ప్రారంభించుకోవాలి అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో పెర్మిషన్ల కోసం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో మీటింగ్ లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ తో కూడా చిరంజీవితో పలువురు నిర్మాతలు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ మీటింగ్ ల పై నందమూరి బాలకృష్ణ ఫైర్ అయ్యాడు. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. “మీటింగ్స్ పెట్టుకున్న సంగతి నాకు తెలీదు. షూటింగ్ ల గురించి మాట్లాడుకున్నారో లేక తలసాని తో కలిసి అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి మాట్లాడుకుంటున్నారో ఎవరికి తెలుసు. నాకు ఏమైనా భయమా మాట్లాడడానికి..! ఇక్కడ గ్రూప్ లు పెడుతున్నారా..

కనీసం నాకు చెప్పను కూడా చెప్పలేదు” అంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు బాలయ్య. అయితే బాలయ్య కామెంట్స్ ను.. ఆయనకి అత్యంత సన్నిహితుడైన నిర్మాత సి.కళ్యాణ్ కళ్యాణ్ ఖండించారు. ‘ఆ మీటింగ్ ల గురించి ఎవ్వరికీ ఆహ్వానాలు వెళ్ళలేదు. అందరూ చొరవ చేసుకుని వచ్చినవారే’ అంటూ కౌంటర్ వేశారు.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus