ఇది కృష్ణవంశీకి లక్కీ ఆఫర్!!!

  • June 29, 2016 / 07:00 AM IST

కృష్ణ వంశీ…టాలీవుడ్ మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన కృష్ణ వంశీ….చాలా సున్నితమైన అంశాలతో కూడిన కధలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావలి అని ప్రయత్నాలు ఎన్ని చేశాడు. అంతేకాకుండా అదే క్రమంలో ఎన్నో చేదు అనుభవాలను సైతం ఎదుర్కున్నాడు. అయినా ఎక్కడ వెనకడుగు .లేదు. తాజాగా కృష్ణ వంశీ టైమ్ అస్సలు బాగోలేదు.

మంచి సినిమా పడితే కానీ ఈ దర్శకుడి మ్యాటర్ ఏమవుతుందో చెప్పలేము అన్నట్లుగా ఉంది. అదే క్రమంలో బాలయ్య ను కలసి “రైతు” అనే పవర్‌ఫుల్ స్టోరీ ఒకటి చెప్పాడు కృష్ణ వంశీ…అయితే బాలయ్య తన 100వ సినిమా విషయంలో ఎన్నో కధలు వింటున్న క్రమంలో ఈ రైతు కధ కూడా విన్నాడు, కధ నచ్చిన బాలకృష్ణ దాదాపుగా కృష్ణ వంశీకే ఒకే చెప్తాడు అని అందరూ అనుకున్నారు, కానీ 100వ చిత్రం చరిత్రలో నిలిచిపోవాలి అన్న ఆలోచనతో క్రిష్ చెప్పిన శాతకర్ణి కధకు ఒకే చెప్పాడు. ఇక లైట్ తీసుకున్న కృష్ణ వంశీ….ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా నక్షత్రం సినిమా చేస్తున్నాడు.

సందీప్ కిషన్, రెజినా జంటగా నటిస్తున్న ఈ సినిమాతో తన సత్తా ఛాటాలి అన్న ఆలోచనతో ఉన్న ఈ దర్శకుడికి సడన్ గా బాలయ్య నుంచి కబురు వచ్చి, సినిమా చేద్దాం అని చెప్పడం అంతేకాకుండా, ఓ పక్క శాతకర్ణి సినిమా చూసుకుంటూనే మరో పక్క రైతు సినిమాకు సంబందించిన పూర్తి స్థయి కథను కూడా రెడీ చేయమని కృష్ణవంశీకి బాలయ్య వివరించడంతో, కృష్ణంవంశీకి ఇది నిజంగా లక్కీ ఆఫర్ అని చెప్పాలి అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఏది ఏమైనా…ఎవరితో ఎన్ని సినిమాలు తీసిన బాలయ్య తో ఒక్క బ్లాక్ బస్టర్ పడితే…ఆ దర్శకుడు మరో 10ఏళ్లు తిరిగి చూసుకోవక్కర్లేదు…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus