Balakrishna: పాన్ ఇండియా దర్శకునితో బాలయ్య?

  • July 20, 2021 / 06:42 PM IST

దర్శకుల జయాపజయాలతో సంబంధం లేకుండా కథ నచ్చితే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే హీరోలలో బాలకృష్ణ ఒకరనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం అఖండ మూవీలో నటిస్తున్న బాలకృష్ణ ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మరో సినిమాలో నటించనున్నారు. బాలయ్య ఈ దర్శకులతో పాటు మరో డైరెక్టర్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.బాలకృష్ణ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో పైసా వసూల్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ సాధించిన పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో లైగర్ పేరుతో పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తూ పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. బాలయ్య పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. బాలయ్య ఆరు పదుల వయస్సులో కూడా శరవేగంగా సినిమాల్లో నటించడంతో పాటు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కుర్రహీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు.

బాలయ్య సక్సెస్ లలో ఉన్న దర్శకులకే వరుసగా సినిమా ఆఫర్లను ఇస్తూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న అఖండ షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus