నర్తనశాల ని తెరకెక్కించడానికి ప్రయత్నిస్తున్న బాలకృష్ణ

  • June 21, 2017 / 12:12 PM IST

మహానటుడు నందమూరి తారక రామారావు నటించిన ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో నర్తనశాల ఒకటి. 1963 లో వచ్చిన ఈ సినిమా అందరికీ నచ్చింది. నవరసాలు నిండిన ఈ సినిమా అంటే బాలకృష్ణకు చాలా ఇష్టం. అందుకే ఆ చిత్రాల్లోని మాధుర్యాన్ని నేటి జనరేషన్ కి రుచి చూపించాలని సొంత దర్శకత్వంలో తెరకెక్కించాలని అనుకున్నారు. 2004 మార్చి ఒకటిన షూటింగ్ ని ప్రారంభించారు. ఇందుకోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ కూడా వేశారు. ఇందులో ద్రౌపతి పాత్ర పోషిస్తున్న సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయేసరికి ఈ సినిమాని ఆపేసారు. అయినా ఆ కథపై బాలయ్యకి ఆసక్తి తగ్గలేదు.

నేడు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నర్తనశాలని కొత్తగా తెరకెక్కించాలని భావిస్తున్నారు. ఇందులో నటించడం, డైరక్షన్ మాత్రమే కాదు సొంతంగా నిర్మించాలని అనుకున్నట్లు తెలిసింది. నందమూరి సొంత ప్రొడక్షన్ ప్రారంభించి అత్యధిక బడ్జెట్ తో, భారీ తారాగణంతో తీయాలని ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఈ సారి బాలయ్య ప్రయత్నాలు ఫలించాలని ప్రతి ఒక్కరం కోరుకుందాం.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus