అభిమానుల కోసం బాలయ్య ఏం చేయనున్నాడో తెలుసా…

  • August 17, 2017 / 09:42 AM IST

బాలకృష్ణ ఏం చేసినా సెన్సేషనే. సినిమాల్లో ఆయన చేసే డ్యాన్సులు, ఫైట్స్ చూసి అభిమానులు ఏ విధంగా సంతోషపడతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన డైలాగులు చెబుతుంటే ప్రేక్షకులకి ఉత్సాహం ఉరకలేస్తుంటుంది. అందుకే తన అభిమానులని అలరించడం కోసం బాలయ్య అప్పుడప్పుడూ సరికొత్త ఫీట్లు చేస్తుంటాడు. మొన్నామధ్య తెలుగు చిత్రసీమ మొత్తం కలిసి వైజాగ్ “హుదూద్” బాధితుల కోసం చేపట్టిన కార్యక్రమం కోసం మొదటిసారి పాట పాడిన బాలయ్యను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

ఇప్పుడు మరోమారు తన అభిమానులను అలరించడం కోసం పాట పాడేందుకు రెడీ అయిపోయాడు. నేడు సాయంత్రం ఖమ్మంలో జరగనున్న “పైసా వసూల్” ఆడియో వేడుకలో బాలకృష్ణ సినిమాలో తాను పాడిన పాటను స్టేజ్ మీద లైవ్ లో పెర్ఫార్మ్ చేయనున్నాడు. ఇకపోతే.. సెప్టెంబర్ 1న విడుదలకానున్న “పైసా వసూల్” సినిమా అటు పూరీ జగన్నాధ్ కెరీర్ కు, ఇటు బాలకృష్ణ కెరీర్ కు కీలకం కానుంది. శ్రేయ శరణ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత సారధ్యం వహించిన ఈ సినిమా ట్రైలర్ కూడా ఇవాళ ఖమ్మం బాలయ్య అభిమానుల సమక్షంలో విడుదల చేయనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus