Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

టాలీవుడ్ లో కొంత మంది డైరెక్టర్ & హీరో కాంబినేషన్ లకి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారు. దాంట్లో మొదటి వరుసలో ఉండేది పూరి – బాలయ్య కాంబో అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే మామూలుగానే నట సింహం బాలయ్య చాలా ఎనర్జిటిక్ హీరో. ఈ వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడేంత యాక్టీవ్ గా ఉంటారు ఆయన. అలాంటి బాలయ్య బాబు కి డైనమిక్ డైరెక్టర్ పూరి డైరెక్షన్ తోడైతే ఇక సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి అనటంలో సందేహమే లేదు.

Balayya – Puri Combo

అయితే వీరిద్దరి కాంబోలో ఇప్పటివరకు సినిమానే రాలేదా అంటే వచ్చింది. అదే 2017 లో పూరి డైరెక్షన్లో బాలయ్య హీరోగా, శ్రేయ శరన్ హీరోయిన్ గా తెరకెక్కిన మూవీ ‘పైసా వసూల్’. ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా మెప్పించకపోయినా కూడా దాంట్లో బాలయ్య కారెక్టరైజెషన్ కి ఆయన అభిమానులు ఫిదా ఐయ్యారని చెప్పొచ్చు. అయితే ఈ క్రేజీ కాంబో మళ్ళీ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతుంది అని సినీ వర్గాల నుంచి గట్టిగా టాక్ వినపడుతుంది.

ప్రస్తుతానికి డైరెక్టర్ పూరి జగన్నాథ్ , విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో రూపొందిన ‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’ మూవీ విడుదలకు సిద్ధం అవుతున్నారు. ఈ మూవీలో సంయుక్త మీనన్ కీకపాత్రలో నటిస్తుంది. ఇక బాలయ్య కూడా గోపీచంద్ మలినేని ప్రాజెక్టు లో బిజీ బిజీగా వున్నారు. అయితే పూరి ఇప్పటికే ఒక కథను తయారు చేసి, బాలయ్యకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారట. కాగా ఈ కాంబినేషన్లో కొత్త ప్రాజెక్టు ఇప్పటివరకు రెడీ అవుతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Pawan Kalyan: షారుఖ్‌ ఖాన్‌కి ఇచ్చేంత ఇస్తామన్నా.. పవన్‌ ఓకే చెప్పలేదట..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus