Bellamkonda Sreenivas: పెద్ద బెల్లంకొండ కొత్త సినిమా ఫిక్స్‌… భయపెట్టడానికి రెడీ అట!

  • February 26, 2024 / 11:39 AM IST

కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే… ప్రయోగాలు చేస్తూ వచ్చారు యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ‘అల్లుడు శీను’ సినిమాతో కెరీర్‌ ప్రారంభించిన ఆయన… హిందీలో ‘ఛత్రపతి’ రీమేక్ చేసి అక్కడ కూడా బోణీ కొట్టారు. అయితే విజయాల బోణీ పడలేదు అనుకోండి. తెలుగులో ఇప్పటికే వరుస ఫ్లాప్‌లు ఇచ్చిన ఆయన… ఇప్పుడు మరో కమర్షియల్‌ సినిమా సిద్ధం చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత ఓ హారర్‌ సినిమా చేస్తున్నారని టాక్‌ నడుస్తోంది. ఈ మేరకు కథ దాదాపు ఓకే చేసేశారని కూడా చెబుతున్నారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లో ఎక్కువ శాతం విజయాలు కమర్షియల్ జానర్ సినిమాలవే. అయితే ‘రాక్షసుడు’ లాంటి థ్రిల్లర్‌ సినిమా చేసి మంచి విజయమే అందుకున్నారు. అందుకేనేమో ఈసారి స్ట్రెయిట్ కథతో జోనర్‌ మార్చాలని చూస్తున్నారు. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం అయితే ఆ సినిమా హారర్ జోనర్‌లో ఉండబోతోంది. కార్తికేయ, లావణ్య త్రిపాఠి చేసిన ‘చావు కబురు చల్లగా’ సినిమా గుర్తుందిగా… ఆ సినిమా దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి ఇప్పుడు పెద్ద బెల్లంకొండ తో ఆ సినిమా చేయనున్నారని తెలిసింది.

దర్శకుడిగా పరిచయమైన ‘చావు కబురు చల్లగా’ సినిమాలో ఫిలాసఫీ చెప్పే ప్రయత్నం చేశారు కౌశిక్. అయితే ఈసారి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫార్మాట్‌లో హారర్ సినిమా చేస్తారట. ఇటీవల బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు కథ వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. త్వరలో నిర్మాత తదితర వివరాలు బయటికొస్తాయి అని అంటున్నారు. ఈలోపు (Bellamkonda Sreenivas) సాయి శ్రీనివాస్‌ ‘టైసన్‌ నాయుడు’ సినిమాను పూర్తి చేస్తాడట.

సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో ‘టైసన్ నాయుడు’ తెరకెక్కుతోంది. హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పదో చిత్రమిది. ఇప్పటికే వచ్చిన ‘టైసన్ నాయుడు’ సినిమా గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా పనులు పూర్తి చేసిన సమ్మర్‌లోనే రిలీజ్‌ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలో రిలీజ్‌ డేట్‌ విషయంలో క్లారిటీ వస్తుంది అంటున్నారు.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus