ఆర్ ఎక్స్ 100 భామతో రొమాన్స్ కి సిద్ధమంటున్న బెల్లంకొండ శ్రీనివాస్

  • July 25, 2018 / 07:58 AM IST

బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి నుంచి స్టార్ హీరోయిన్స్ ని తన పక్కన నటించేలా చేసుకుంటున్నారు. సమంత, తమన్నా, పూజా హెగ్డే లతో జోడీ కట్టారు. తాజాగా అతని కన్ను పాయల్ రాజ్ పుత్ పై పడింది. ఈమె ఆర్ ఎక్స్ 100 సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది. యువతని ఆకర్షిస్తోంది. అందుకే రెండు కోట్లతో నిర్మితమైన ఈ మూవీ 20 కోట్ల గ్రాస్ ని వసూలు చేసి.. మరిన్ని కలక్షన్స్ రాబట్టేందుకు దూసుకుపోతోంది. అందుకే దర్శకనిర్మాతలు ఆమె డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆమె కావాలని కోరుకుంటున్న తెలుగు హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ ముందు వరుసలో ఉన్నట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ప్రస్తుతం ఈ యువ హీరో తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.

ఇందులో హీరోయిన్ గా టాలీవుడ్ క్వీన్ కాజల్ అగర్వాల్ సెలక్ట్ అయింది. దీని తర్వాత కొత్త దర్శకుడితో బెల్లంకొండ శ్రీనివాస్ మరో సినిమాకి ఒకే చెప్పారు. అందులో హీరోయిన్ గా ఎవరైతే బాగుంటుందని డైరక్టర్ కొంతమంది పేర్లను పరిశీలిస్తుంటే.. బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం పాయల్ పేరు సూచించినట్టు టాక్. ఆమె అందం, అభినయం బాగుండడంతో అతను కూడా ఓకే చెప్పినట్టు తెలిసింది. త్వరలోనే పాయల్ ని కలవనున్నారు. ఆమెకు భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. మొత్తానికి ఎలాగైనా హాట్ భామతో రొమాన్స్ చేయాలనీ బెల్లంకొండ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus