అలియా పై సుశాంత్ ఫ్యాన్స్ ఈ స్థాయి కసిని పెంచుకున్నారా..!

  • August 12, 2020 / 06:03 PM IST

ఈవాళ సోషల్ మీడియా మొత్తం ఒకటే రచ్చ. అలియా భట్ హీరోయిన్ గా ఆమె తండ్రి మహేష్ భట్ తెరకెక్కించిన సడక్ 2 చిత్ర ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ మూవీ ట్రైలర్ కోసం దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే, కసిగా ఎదురుచూస్తున్నారు. అదేంటి సుశాంత్ ఫ్యాన్స్ కి అలియా భట్, మహేష్ భట్ బద్దశత్రువులు కదా, వారి సినిమా ట్రైలర్ కోసం వీరు ఎదురుచూడడం ఏమిటీ…అనే డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ చెప్పబోయే మ్యాటర్ కూడా ఇదే.

మహేష్ భట్, అలియాపై ఎలా పగ తీర్చుకోవాలని చూస్తున్న సుశాంత్ ఫ్యాన్స్ కి సడక్ 2 ట్రైలర్ రూపంలో ఓ అవకాశం దొరికింది. విడుదలైన గంటల వ్యవధిలో ఆ ట్రైలర్ పై డిజ్ లైక్స్ తో విరుచుకుపడ్డారు. ఇప్పటికే ఈ ట్రైలర్ డిజ్ లైక్స్ సంఖ్య 1.5 మిలియన్స్ కి చేరువైంది. అదే సమయంలో లైక్స్ సంఖ్య ఒక లక్షకు కూడా చేరుకోలేదు. సుశాంత్ మరణం బాలీవుడ్ పెద్దలపై కొందరికి ఏస్థాయి కోపాన్ని రగిలించిందో ఇది ఒక ఉదాహరణ.

ఇక కామెంట్ సెక్షన్ లో కూడా అసలు ట్రైలర్ చూడకుండానే డిజ్ లైక్ కొట్టాలని వారు కామెంట్ చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డిజ్ లైక్స్ సాధించిన ట్రైలర్ గా సడక్ 2 కొత్త రికార్డు నెలకొల్పింది. ఇక వరల్డ్ లోనే అత్యధిక డిజ్ లైక్స్ పొందిన ట్రైలర్ గా రికార్డుల్లో నిలపడం కోసం, సుశాంత్ ఫ్యాన్స్ పని చేస్తున్నారు. ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్న నేపథ్యంలో అక్కడ కూడా ప్రేక్షకులు చిత్రాన్ని అవైడ్ చేస్తే , భారీ నష్టాలు తప్పవు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus