బిగ్‌బాస్‌ 25వ రోజు రివ్యూ – మెహబూబ్‌ మైండ్‌ బ్లాక్‌… కుమార్‌సాయి రాక్స్‌

  • October 2, 2020 / 12:27 AM IST

కొత్త కెప్టెన్‌ కోసం బిగ్‌బాస్‌ పెట్టిన ‘కిల్లర్‌ కాయిన్స్‌’ టాస్క్‌ పూర్తయింది. నిన్నటివరకు ఇంట్లో ఉండటానికి పనికిరాడు అంటూ చాలామంది అన్న కుమార్‌సాయి గెలిచి… ఏకంగా కెప్టెన్‌ అయ్యాడు. అయితే ఈ టాస్క్‌ విషయంలో బిగ్‌బాస్‌ చాలా ట్విస్ట్‌లు తిప్పాడు. గురువారం ఎపిసోడ్‌లో ఇంకా ఏమైందంటే….

‘కిల్లర్‌ కాయిన్స్‌’ టాస్క్‌ రెండో స్టేజీలో అమ్మ రాజశేఖర్‌ – సోహైల్‌ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మాస్టర్‌ దగ్గరకు సోహైల్‌ క్షమాపణ అడిగాడు. కాళ్ల దగ్గర కూర్చొని మరీ బాధపడ్డాడు సోహైల్‌. ‘నా దగ్గర దొంగిలించిన కాయిన్స్‌ నాకు ఇచ్చేస్తే చాలు’ అని మాస్టర్‌ అన్నాడు. అయితే తర్వాత మాస్టర్‌కు హెల్ప్‌ చేసే అవకాశం వచ్చినా… మెహబూబ్‌ మాట విని సోహైల్‌ చేయలేదు. దీంతో మాస్టర్‌-సోహైల్‌ మధ్య తర్వాత కూడా చర్చ నడిచింది.

కెప్టెన్సీ టాస్క్‌ను సాగదీయాలనో, రకరకాల స్టేజీలు పెట్టి డ్రామా పండించాలనో కానీ బిగ్‌బాస్‌ ఈ టాస్క్‌లు చాలా స్టేజీలు పెట్టాడు. స్విచ్‌ కాయిన్‌ పేరుతో పెద్ద ట్విస్ట్‌ ఇచ్చాడు. రెండో స్టేజీ అయిపోయాక సామ దాన బేధ దండోపాయాలతో కాయిన్స్‌ విలువ పెంచుకోవచ్చు బిగ్‌బాస్‌ ఓ సూచన చేశాడు. దీంతో ఇంట్లో బేరాలు మొదలయ్యాయి. అఖిల్‌, మెహబూబ్‌, సోహైల్‌, మోనాల్‌ ఒక్కటై మెహబూబ్‌కు కాయిన్స్‌ ఇవ్వగా, కుమార్‌సాయి, హారిక వేరుగా నిలిచారు. మిగిలిన హౌస్‌మేట్స్‌ రాజశేఖర్‌ మాస్టర్‌కు సపోర్టు చేశారు.

ఇక్కడే బిగ్‌బాస్‌ స్విచ్‌ కాయిన్‌ను వాడే అవకాశం ఇచ్చాడు. ఆ కాయిన్‌ ఉన్న సుజాత… స్విచ్‌ చేసుకొని మెహూబూబ్‌ మొత్తం కాయిన్స్‌ 10,800ను తీసేసుకుంది. దీంతో అతను ఆట నుంచి తప్పుకున్నాడు. అలా సుజాత (10,800), అమ్మ రాజశేఖర్‌ (3650), కుమార్‌ సాయి (1350), హారిక (1450) కాయిన్స్‌తో కెప్టెన్సీ పోటీలో నిలిచారు. మెహబూబ్‌ దగ్గరున్న కాయిన్స్‌ రెండు పార్టులు చేసుంటే బాగుండు అని మోనాల్‌ చెప్పింది. నిజమే అలా విడదీసి ఉంటే బాగుండేది. కానీ ఏం చేయలేం అంతా అయిపోయింది. అఖిల్‌ కూడా ఇదే మాట అన్నాడు.

అఖిల్‌ – మోనాల్‌ – అభిజీత్‌ ట్రయాంగిల్‌ స్టోరీ ఇంట్లో ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కోలా కనిపిస్తున్న ఈ స్టోరీ ఈ రోజు మొత్తం అఖిల్‌- మోనాల్‌ స్టోరీలా కనిపించింది. ఇద్దరూ సోఫా దగ్గర క్లోజ్‌గా కూర్చోవడం కనిపించింది. మరోవైపు దివి – హారిక -అభిజీత్‌ మధ్య ఇదే చర్చ జరిగింది. సమ్‌థింగ్‌ హ్యాపనింగ్‌ అంటూ చర్చించుకున్నారు. దీని మీద ఎవరు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

కొత్త కెప్టెన్‌ కోసం బిగ్‌బాస్‌ బురదలో కాసుల వేట అనే టాస్క్‌ ఇచ్చాడు. గార్డెన్‌ ఏరియాలో బురద పోసి, అందులో కాయిన్స్‌ వేశాడు. వాటిని ఏరి బుట్టలో వేయాలని హౌస్‌ మేట్స్‌కు చెప్పాడు. కెప్టెన్సీ పోటీలో ఉన్న అమ్మ రాజశేఖర్‌, హారిక, కుమార్‌సాయి, సుజాత బురదలోకి దిగారు. హోరాహోరీ పోరులో కుమార్‌ సాయి గెలిచాడు.

Click here -> కెప్టెన్‌ ఎంపిక ఎలా సాగిందంటే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus