బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇక లేరు..!

  • April 29, 2020 / 12:15 PM IST

మొన్నటి వరకు విచిత్రమైన కాన్సర్  వ్యాధితో పోరాడి ఈ మధ్యే భారత్‌కు వచ్చాడు బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌. అయితే అంతలోనే ఈయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇర్ఫాన్ ఖాన్ తల్లి సైదా బేగం ఎప్రిల్ 25 ఉదయం కన్ను మూసింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా కన్నతల్లిని కడసారి చూపులకు నోచుకోలేకపోయాడు. ఇక తన తల్లి అంత్యక్రియలను అతను వీడియో మాధ్యమం ద్వారా వీక్షించి ఎంతో తల్లడిల్లిపోయాడు. కన్నతల్లి కనుమూసి నాలుగైదు రోజులు కాలేదు..

అపుడే ఇర్ఫాన్ ఖాన్ మరోసారి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలైయ్యాడు. తీవ్ర అనారోగ్యంతో ఈయన ముంబాయిలోని కోకిలాబెన్ ధీరూబాయి అంబానీ హాస్పిటల్‌లో చేరారు. 53 ఏళ్ల ఇర్ఫాన్ ఖాన్‌కు డాక్లర్టు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక హాస్పిట‌లో ఆయన వెంట భార్య సుతాపా సిక్దర్, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. గతంలో న్యూరోఎండోక్రిన్ ట్యూమర్’ అనే అతిఅరుదైన క్యాన్సర్‌ కారణంగా లండన్‌లో చికిత్స్ తీసుకున్నాడు. అంతేకాదు క్యాన్సర్ నుంచి కోలుకోని రీసెంట్‌గా ‘అంగ్రేజీ మీడియం’ అనే సినిమ ాలో ముఖ్యపాత్రలో నటించారు.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
సమంత బర్త్ డే స్పెషల్ : రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus