“8 వసంతాలు” (8 Vasantalu) అనే చిత్రం గత శుక్రవారం విడుదలైన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే.. ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ మాత్రం ఎందుకో పెద్దగా ఆసక్తి చూపలేదు. మంచి నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినప్పటికీ, థియేటర్ పరంగా కనీస స్థాయి కలెక్షన్స్ లేక చతికిలపడింది. అటువంటి తరుణంలో.. ఇష్టం లేకుండానే మైత్రీ మూవీ మేకర్స్ ఇవాళ (జూన్ 23) ‘HEART WARMING BLOCKBUSTER’ పేరిట “8 వసంతాలు” (8 Vasantalu) సినిమాకి సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.
ఈ ఈవెంట్ కి నిర్మాతలు కానీ, దర్శకుడు ఫణీంద్ర (Phanindra Narsetti) కానీ హాజరు కాలేదు.మైత్రీ మూవీ మేకర్స్ ఎందుకు రాలేదు అనే విషయం పక్కన పెడితే.. ఫణీంద్ర ఈ ఈవెంట్ కి హాజరుకాకపోవడానికి కారణం ఆయనకి ఆరోగ్యం బాలేదు అని చిత్రబృందం చెబుతున్నప్పటికీ, మీడియాని ఎదుర్కొనేందుకు తచ్చాడి ఈవెంట్ కి రాలేదని తెలుస్తోంది.
ఇకపోతే.. ఈ ఈవెంట్లో ఓ సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న సరికొత్త సంచలనానికి దారి తీసింది. “8 వసంతాలు” (8 Vasantalu) సినిమాలో ఫణీంద్ర పెన్ను పక్కన పెట్టి తెరకెక్కించిన కాశీ ఫైట్ లో ఓ బ్రాహ్మణుడ్ని విలన్ గా చూపించడం, పరమ పవిత్ర క్షేత్రంగా పూజించబడే కాశీలో కబేళాను చూపించడం ఎంతవరకు సమంసజం అంటూ ప్రశ్నించారు. దాంతో చిత్రబృందం బేలమొహం పెట్టడం తప్ప, సమాధానం చెప్పలేకపోయింది.
మరి ఫణీంద్ర (Phanindra Narsetti) ఈ విషయమై ఏమైనా క్లారిటీ ఇస్తాడా లేక ఇవాళ ఈవెంట్ ఎస్కేపీ చేసినట్లు సైలెంట్ గా ఉండిపోతాడా అనేది చూడాలి. ఇక ఇదే ఈవెంట్లో సినిమాటోగ్రాఫర్ విశ్వనాధ్ రెడ్డి మాట్లాడుతూ.. “నెట్ ఫ్లిక్స్ లో మా సినిమా క్వాలిటీ చాలా బాగుంటుంది, అక్కడ చూడండి” అని చెప్పడంతో టీమ్ ఆల్రెడీ సినిమా రిజల్ట్ ను అంగీకరించారా? అనేది చర్చనీయాంశం అయ్యింది.
థియేటర్ కంటే నెట్ ఫ్లిక్స్ లో “8 వసంతాలు” సినిమా ఇంకా బాగుంటుంది
– సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి#8Vasantalu #AnanthikaSanilkumar#PhanindraNarsetti #HeshamAbdulWahab pic.twitter.com/Ne343ci1fz
— Filmy Focus (@FilmyFocus) June 23, 2025
రిపోర్టర్: కాశీ ఫైట్లో బ్రాహ్మణులను టార్గెట్ చేసి.. కబేళా చూపించాల్సిన అవసరం ఏముంది?
8 వసంతాలు టీమ్: దానికి సమాధానం రైటర్-డైరెక్టర్ ఫణీంద్ర నార్శెట్టి చెబితే బాగుంటుంది. #8Vasantalu #AnanthikaSanilkumar #PhanindraNarsetti #HeshamAbdulWahab pic.twitter.com/96fB5ItDQR
— Filmy Focus (@FilmyFocus) June 23, 2025