హోమ్ మినిస్టర్ సహాయంతో సూపర్ స్టార్ కి స్పెషల్ సెక్యూరిటీ

  • November 5, 2019 / 02:39 PM IST

సరిలేరు నీకెవ్వరు చిత్రం షూటింగ్ ఇటీవల కాష్మీర్ లో ఒక భారీ షెడ్యూల్ ముగించుకున్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ కోసం మహేష్ బాబు, సత్యదేవ్ మరియు ఇతర ముఖ్యతారాగణం కాష్మీర్ లో కొన్ని రోజులు నివసించారు. సరిగ్గా అదే తరుణంలో కాష్మీర్ లో ఆర్టికల్ 370 గురించి రచ్చ మొదలైంది. కోట్ల రూపాయలు వెచ్చించి ప్లాన్ చేసిన ఆ షెడ్యూల్ ను ఆపడం కూడా కష్టమే. దాంతో మహేష్ బాబు & అనిల్ సుంకర తమ పోలిటికల్ కాంటాక్ట్స్ ను వాడి సినిమా షూటింగ్ కు ఎలాంటి ఆటంకం వాటిల్లకుండా చూసుకొన్నారంట.

ఈ సినిమా షెడ్యూల్ జరుగుతున్నంత కాలం మహేష్ & టీం కి సెంట్రల్ గవర్నమెంట్ బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీ అందించిందట. సెంట్రల్ హోమ్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ఇందుకు సహాయపడ్డారు. అంత సెక్యూరిటీతో కూడా మొదటి రోజు షూటింగ్ చేయడానికి కుదరలేదట బృందానికి. దాంతో చాలా ఇబ్బందులుపడి పహల్గామ్ లో చిత్రీకరణ పూర్తిచేశారట. ఈ విషయాన్ని అనిల్ సుంకర ఇటీవల మీడియాతో పంచుకొన్నారు. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మండన్న కథానాయికగా నటిస్తుండగా.. విజయశాంతి కీలకపాత్ర పోషిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus