సెన్సార్ సభ్యుల మెప్పు అందుకున్న అనుష్క భాగమతి

  • January 18, 2018 / 11:21 AM IST

దక్షిణాది భాషల్లోని టాప్ హీరోయిన్ లో అనుష్క ఒకరు. బాహుబలితో ఆమెకు దేశవ్యాప్తంగా అభిమానులు పెరిగారు. వారందరూ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని అనుష్క బాహుబలి తర్వాత ఆచితూచి అడుగులు వేస్తోంది. బాహుబలి కంక్లూజన్ తర్వాత స్వీటీ కేవలం ఒక సినిమా మాత్రమే ఒప్పుకుంది. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో అనుష్క భాగమతి అనే సినిమా చేస్తోంది. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూస్తుంటే అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి వంటి ప్రత్యేకమైన సినిమాల మాదిరిపోగానే అనుష్క కెరీర్ లో ఈ మూవీ నిలిచిపోతుందనిపిస్తోంది. అనిపించడమే కాదు అది నిజమని సెన్సార్ సభ్యుల టాక్. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు నిర్మించిన ఈ మూవీ నిన్న సెన్సార్ సభ్యుల వద్దకు వెళ్ళింది.

142 నిముషల నిడివిగల ఈ సినిమాని చూసిన వారు క్లీన్ యు సట్టిఫికేట్ ని అందించారు. అనుష్క ఈ సినిమాలో రెండు విభిన్న షేడ్స్ లో నట విశ్వరూపం ప్రదర్శించిందని చూసిన వారు చెప్పారు. థమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో భాగమతిని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి నిర్మాతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus