‘మిడిల్ ఫింగర్’ ను వాళ్ళకే అంకితం చేసిందా?

  • August 7, 2019 / 02:50 PM IST

అప్పట్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండేది ఛార్మీ. గ్లామర్, నటన, డాన్స్.. ఇవన్ని విషయాల్లోనూ ఛార్మీ టాలెంటెడ్ అనడంలో సందేహం లేదు. అయితే హిట్లు లేకపోవడంతో ఈమెకు ఎక్కువ ఆఫర్లు వచ్చేవి కాదు. దీంతో ఆమె నిర్మాణం వైపు మళ్ళింది. ఛార్మీ సినిమాలు నటించడం మానేసి నాలుగేళ్ళయింది. ఆమె హీరోయిన్ గా నటించిన చివరి సినిమా ‘జ్యోతిలక్ష్మి’. ఆ తరువాత .. పూరి జగన్నాధ్ తో కలిసి ‘పూరి కనెక్ట్స్’ బ్యానర్ స్థాపించి సినిమాలు నిర్మిస్తూ వచ్చింది. మొదటి ప్రయత్నంగా ‘రోగ్’ సినిమాను నిర్మించింది. ఆ తరువాత ‘మెహబూబా’ చిత్రాన్ని కూడా నిర్మించింది.

అయితే ఆ రెండు చిత్రాలు ప్లాపయ్యాయి. అయినా నిరాశ చెందకుండా.. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ చిత్రం కొన్న ప్రతీ డిస్ట్రిబ్యూటర్ లాభపడ్డాడు. నిర్మాతగా ఛార్మీకి కూడా మంచి పేరొచ్చింది. ఇప్పటికీ చిత్ర యూనిట్ ‘సక్సెస్ సెలెబ్రేషన్స్’ ను ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఛార్మీ తన సోషల్ మీడియాలో ఓ ఫోటోని పోస్ట్ చేసింది… ‘నా లేటెస్ట్ పిక్ అడుగుతున్న అందరికీ #ఇస్మార్ట్ శంకర్ #సక్సెస్” అంటూ ట్వీట్ చేసింది. ఈ ఫొటోలో.. ఒక చేత్తో వైన్ గ్లాసు పట్టుకొని ఫుల్ జోష్ లో నవ్వుతూ మిడిల్ ఫింగర్ చూపిస్తోంది. మరి ఆ మధ్యవేలు ఎవరికి చూపిస్తోందో చెప్పలేదు. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్, ట్రైలర్ విడుదలైనప్పుడు అనేక ట్రోల్స్ వచ్చాయి. బహుశా ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ అయ్యింది కాబట్టి వాళ్ళకే ఈ వేలు చూపించిందేమో’ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus