పనిని ప్రేమిస్తున్న ఛార్మి

  • August 17, 2016 / 12:48 PM IST

మంత్ర సినిమాలో “మహా మహా” అనే పాటతో యువతను ఆకట్టుకున్న ఛార్మి పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో అదరగొట్టింది. జ్యోతిలక్ష్మి సినిమాలో వేశ్యగా నటించి విమర్శకుల అభినందనలు అందుకున్న ఈ పంజాబీ ముద్దుగుమ్మ ప్రస్తుతం అవకాశాలు తగ్గి పోవడంతో సొంతంగా క్యాస్టింగ్ ఏజెన్సీని మొదలు పెట్టింది. ఈ కంపెనీలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కు భాగస్వామ్యం ఉంది.  ఈ ఏజెన్సీ ద్వారా ఛార్మి అందమైన భామలను తెలుగు తెరకు పరిచయం చేయనుంది.

రీసెంట్ గా రాజ్ తరుణ్ నటిస్తున్న రాజుగాడు  సినిమాకు హీరోయిన్ గా అమైరా దస్తూర్ ని ఛార్మి సెట్ చేసింది. ప్రస్తుతం పూరి తో పాటు మరికొంతమంది దర్శకులకు వారి సినిమాలో ఐటెం సాంగ్ చేసే బ్యూటీలను అందించే పనిలో ఉంది. అయితే ఈ పంజాబీ ముద్దుగుమ్మకు నిన్న ఆరోగ్యం దెబ్బతింది. దీంతో హాస్పిటల్లో చేరి ఈ రోజు సాయంత్రం వరకు చికిత్స తీసుకుని వైద్యులు పరవాలేదని చెప్పడంతో ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకోకుండా పనిలో పడిపోయింది. ఈ సంగతిని ఆమె బుధవారం సోషల్ మీడియాలో వెల్లడించింది. ” పనిలో పడితే అనారోగ్యం పారి పోతుంది. అందుకే ఆస్పత్రి నుంచి రాగానే పనిలో దిగాను” అని ఛార్మి ట్వీట్ చేసింది. తన చేతి ఫోటోలను కూడా పోస్ట్ చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus