Chiranjeevi: హీరో కాక ముందు ఆ సీరియల్ లో చిరు నటించారట..!

  • July 15, 2021 / 04:15 PM IST

ఆంధ్రప్రదేశ్ కు చెందిన పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో పుట్టి పెరిగిన మెగాస్టార్ చిరంజీవి ఈరోజున సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన వేసిన బాటలో ఇప్పుడు చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ వంటి హీరోలు సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు.ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి…సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు.. చెన్నైలో ఓ యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకున్నారు.

అటు తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ క్రేజ్ ను సంపాదించుకున్నారు. సెకండ్ హీరోగా, విలన్ గా కూడా ఆయన నటించారు. ఇదే క్రమంలో ఆయన బుల్లితెర పై కూడా మెరిశారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ వంటి షోకి చిరు హోస్ట్ చేసినట్టు మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఓ సీరియల్ లో కూడా నటించారన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలుసుండదు.

విషయంలోకి వెళితే.. బాలీవుడ్లోని ఓ హిందీ సీరియల్ లో చిరంజీవి నటించారు. అప్పట్లో దూరదర్శన్ లో ప్రసారమయ్యే ‘రజిని’ అనే ధారావాహిక లో చిరంజీవి అతిథి పాత్ర పోషించారు. అది కూడా ఒక్క ఎపిసోడ్లోనే కనిపిస్తారు లెండి.దాని తర్వాత చిరంజీవికి వరసగా సినిమాల్లో అవకాశాలు రావడంతో మళ్ళీ సీరియల్స్ వైపు ఆయన కన్నెత్తి చూడలేదు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus