చిరు, మహేష్ ల రేర్ పిక్ వెనుక అంత కథ ఉందా ..?

  • July 9, 2020 / 06:00 PM IST

టాలీవుడ్ లో స్టార్ హీరోల కలయికలు అనేవి చాలా అరుదుగా జరుగుతుంటాయి. అవార్డు ఫంక్షన్లలోనో లేక సెలబ్రిటీల ఇళ్లల్లో ఏవైనా వేడుకలు జరిగితేనో.. వాళ్ళు కలుస్తుంటారు. ప్రైవేట్ గా కలుసుకున్నా.. వాటికి సంబంధించిన ఫోటోలు త్వరగా బయటకు రావు. ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, దర్శకుడు గుణశేఖర్, నిర్మాత అల్లు అరవింద్ కలిసి ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఈ ఫొటోలో అందరూ చాలా డీప్ డిస్కషన్లో ఉన్నారు.

ఇది ఎప్పటిదో పిక్ అయినప్పటికీ.. దీని వెనుక చాలా కథ ఉందని సమాచారం. మహేష్ బాబు- గుణశేఖర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అర్జున్’ సినిమా రోజులవి. ‘ఒక్కడు’ సినిమా కాంబినేషన్ కాబట్టి ‘అర్జున్’ సినిమా పై మొదటి నుండీ భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా మొదటి వారం మంచి కలెక్షన్లనే రాబట్టింది. రెండో వారం నుండీ ‘అర్జున్’ చిత్రం పైరసీ భారిన పడింది. దాంతో చాలా వరకూ సెకండ్ వీక్ కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వచ్చాయి.

ఈ విషయం మహేష్ బాబు, గుణ శేఖర్ ల చెవిలో పడింది. అంతే దీని పై యాక్షన్ తీసుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నించారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి,నిర్మాత అల్లు అరవింద్ లతో మీటింగ్ లు కూడా జరిపారు. అప్పుడు తీసిన ఫోటోనే ఇదని తెలుస్తుంది. ‘అర్జున్’ పైరసీని అరికట్టే విషయంలో మెగా ఫ్యామిలీ అంతా ఆ టీం కు అండగా నిలిచారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే తనతోనే ఉంటూ సాయం అందించారని మహేష్ బాబు కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus