Chiranjeevi: సీక్వెల్ తీస్తే కలిసి నటించడానికి సిద్దమంటున్న చిరంజీవి!

  • September 2, 2024 / 10:32 AM IST

“ఇంద్ర” సినిమా 2002లో విడుదలై రికార్డులు నెలకొల్పినప్పుడు, మొన్న చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా 2024లో రీరిలీజ్ అయినప్పుడు నందమూరి అభిమానుల నుండి వచ్చిన ఒకే ఒక్క కామెంట్ “సమరసింహా రెడ్డి సినిమా చూసి చిరంజీవి కూడా అలాంటి సినిమా తీశాడు అంతే” అని. అయితే.. ఇప్పుడు ఆ కామెంట్ ను సమ్మతిస్తూ నిన్న జరిగిన బాలయ్య (Balakrishna) స్వర్ణోత్సవ వేడుకల్లో స్వయంగా మెగాస్టార్ చిరంజీవి “ఇంద్ర సినిమా తీయడానికి ఆదర్శం సమరసింహా రెడ్డి, అభిమానులు గొడవలు పడుతుంటారు.

Chiranjeevi

ఫ్యాన్స్ కోసం హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. అందుకే మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య రాకుండా అందరూ. కలిసి డ్యాన్స్ కూడా వేస్తారు. 50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం” అంటూ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించడం నిన్నటి ఈవెంట్ కి హైలైట్ గా నిలిచింది.

అదే సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా ఇంద్రసేనా రెడ్డి మరియు సమరసింహా రెడ్డి తలపడేలా సీక్వెల్ కథ రాయగలిగితే.. బాలయ్యతో కలిసి నటించడానికి నేను సిద్ధం అని చెప్పడం సరికొత్త సంచలనానికి దారి తీసింది. బాలయ్య & చిరంజీవిని ఒకే సినిమాలో, ఒకే ఫ్రేమ్ పై చూడాలనేది తెలుగు సినిమా అభిమానుల చిరకాల కోరిక. అది గనుక ఇలా ఇంద్ర వెర్సెస్ సమరసింహారెడ్డితో నెరవేరితే మాత్రం తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించినవారవుతారు.

ఆ కాంబినేషన్ తెరపై వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే.. చిరంజీవి ఇలా బాలయ్యను ఉద్దేశించి స్టేజ్ పై మాట్లాడడం.. మెగా వర్సెస్ నందమూరి అనేది ఇకపై లేదని స్పష్టం చేసింది. ఎందుకంటే.. బాలయ్య కూడా చరణ్ తో చాలా సన్నిహితంగా ఉంటారు, పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు రాజకీయాల్లో బాలయ్య సహచరుడే. ఈ అనుబంధం ఇలానే కొనసాగాలని కోరుకుందాం!

Bigg Boss Telugu 8: 14 మంది పార్టిసిపెంట్స్ తో ధూమ్ ధామ్ గా ప్రారంభమైన ‘బిగ్ బాస్ 8’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus