చిరు, ఎన్టీఆర్ లతో త్రివిక్రమ్ మల్టీ స్టారర్..?

Ad not loaded.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్నాడు. ఇందులో చరణ్ చేయాల్సిన ఓ పాత్రని మహేష్ చేత చేయిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. మహేష్ ను గనుక తీసుకుంటే.. ఈ చిత్రానికి మరో 40 కోట్ల బడ్జెట్ పెట్టాల్సి వస్తుందట. అంతేకాదు స్క్రిప్ట్ లో కూడా తగిన మార్పులు చేయాల్సి ఉందట కూడా..! అందుకే చిరు.. చరణ్ తోనే ఆ పాత్రని చేయిస్తే బెటర్ అని ఫిక్సయ్యారని తెలుస్తుంది. అయితే ఈ విషయం పై నిర్మాతలైన ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ వారు కానీ ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ వారు కానీ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఇదిలా ఉండగా… ఇప్పుడు మరో వార్త ‘టాక్ ఆఫ్ ది టౌన్’ అయ్యింది. చిరంజీవి, ఎన్టీఆర్ లతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట. ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఈ చిత్రం ఉండబోతుందని భోగట్టా..! ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ ఓ చిత్రం చేయబోతున్నట్టు ఇటీవల అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఇది పూర్తయిన తర్వాత డీవీవీ నిర్మాణంలో చిరంజీవితో త్రివిక్రమ్ ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. మరి మహేష్ విషయంలోనే ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.. మరి ఎన్టీఆర్ తో ఎప్పుడు ఇవ్వాలి.. అని ప్రస్తుతం కామెంట్ చేసేవారు కూడా లేకపోలేదు.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus