Chiranjeevi: ‘లూసీఫర్’ రీమేక్ ఉన్నట్టా లేనట్టా..? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!

  • May 28, 2021 / 07:53 PM IST

మోహన్ లాల్ హీరోగా నటించిన మలయాళం సూపర్ హిట్ మూవీ ‘లూసీఫర్’ ను తెలుగులోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఈ రీమేక్ లో నటించబోతున్నారు. మొదట ఈ రీమేక్ కోసం చాలా మంది దర్శకులను అనుకున్నప్పటికీ ఫైనల్ గా తమిళ దర్శకుడు మోహన్ రాజా ఫిక్స్ అయ్యాడు. అయితే ‘ఇతను రెడీ చేసిన స్క్రిప్ట్ కూడా చిరుకి నచ్చలేదని.. దాంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని’.. కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు మోహన్ రాజా.

ఆయన ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ అంశం పై స్పందించాడు. మోహన్ రాజా మాట్లాడుతూ.. ” ‘లూసీఫర్’ రీమేక్ ఆగిపోయింది అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మేమంతా బిజీగా గడుపుతున్నాం. ఈ రీమేక్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆల్రెడీ రెండు పాటలను కూడా కంపోజ్ చేశారు. అవి రెండు చిరంజీవి సార్ కి అలాగే చరణ్ కు బాగా నచ్చాయి. దయచేసి ఈ సినిమా ఆగిపోయింది అంటూ వస్తున్న వార్తలను నమ్మకండి.

పరిస్థితులు నార్మల్ స్టేజికి వచ్చిన వెంటనే ఈ చిత్రం షూటింగ్ ను ప్రారంభిస్తాము” అంటూ చెప్పుకొచ్చాడు. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ ల ‘ఆచార్య’ షూటింగ్ కూడా ఫైనల్ స్టేజిలో ఉంది. ఇది పూర్తయిన వెంటనే ‘లూసిఫర్’ రీమేక్ పై దృష్టి పెడతారు. అటు తరువాత మెహర్ రమేష్ డైరెక్షన్లో ‘వేదళం’ రీమేక్ లో కూడా నటిస్తారు.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus