అజ్ఞాతవాసి ఆడియో వేడుకకు చీఫ్ గెస్ట్ గా చిరంజీవి!

  • December 13, 2017 / 03:36 PM IST

సినీ, కుటుంబ ఫంక్షన్లలో మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి కనిపించడం అరుదై పోయింది. మెగా కుటుంబ సభ్యులు అందరూ కలిసినా పవన్ మాత్రం దూరంగానే ఉంటున్నారు. వ్యక్తిగతంగా అన్నయ్యని కలుస్తున్నారు తప్ప.. వేదికపై కలవడం లేదు. అజ్ఞాతవాసి వీరిద్దరిని ఒకే వేదికపై తీసుకురానున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి ముస్తాబవుతోంది. ఈ చిత్రం కోసం అనిరుద్ కంపోజ్ చేసిన పాటల్లో రెండింటిని రిలీజ్ చేశారు. పూర్తి పాటలను ఈనెల 19న  విడుదల చేయనున్నారు.

హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో జరగనున్న ఈ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవిని పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. అందుకు చిరు ఒకే చెప్పినట్లు తెలిసింది.  ప్రస్తుతం చిరంజీవి సైరా నరసింహ రెడ్డి షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ అజ్ఞాతవాసి ఆడియో వేడుకకు రానున్నట్లు సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాలో హీరోయిన్లుగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా..  కుష్బూ కీలక రోల్ పోషిస్తోంది. విక్టరీ వెంకటేష్ కాసేపు కనిపించి అదరగొట్టనున్నారు.  జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా  జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus