జై లవకుశ లో ఆ 15 నిముషాలే హైలెట్!

  • September 19, 2017 / 02:27 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన జై లవకుశ మూవీ అభిమానులను ఊరిస్తోంది. యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్ అంచనాలను పెంచేసాయి. సెన్సార్ సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా రెండు రోజుల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మించిన జై లవకుశ గురించి ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. 158 నిముషాల నిడివిగల ఈ చిత్రంలో చివరి 15 నిముషాలు అదిరిపోతుందని చిత్ర బృందం వెల్లడించింది.

జై క్యారక్టర్ ని అతని తమ్ముళ్లయిన లవ కుమార్, కుశలు చంపే ఈ సన్నివేశం ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేసింది. ముఖ్యంగా జై పాత్రలో ఎన్టీఆర్ నటన అద్భుతమని వర్ణించింది. ఈ క్లైమాక్స్ లో హీరో, విలన్ ఎన్టీఆర్ కావడంతో అభిమానులకు కనుల పండువగా ఉంటుందని వివరించింది. రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో  నందితరాజ్, హంసానందిని తళుక్కున మెరవనున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ లో అందాలతో, స్టెప్పులతో అదరగొట్టనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus