నిఖిల్ …’కార్తికేయ2′ లో స్పెషల్ అదే….!

  • April 21, 2020 / 04:27 PM IST

గతేడాది ‘అర్జున్ సురవరం’ చిత్రంతో హిట్టు కొట్టి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు నిఖిల్. ప్రస్తుతం ‘కుమారి 21ఎఫ్’ దర్శకుడు సూర్య ప్రతాప్ తో 18 పేజెస్ అనే చిత్రాన్ని చేయబోతున్నట్టు ప్రకటించిన నిఖిల్.. తరువాత చందూ మొండేటి డైరెక్షన్లో ‘కార్తికేయ2’ చేయడానికి కూడా రెడీ అవుతున్నాడు.ఈ చిత్రం బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోయింది అని గతంలో వార్తలు వచ్చాయి. అయితే అలాంటిది ఏమీ లేదు అని … ఏకంగా అధికారిక ప్రకటన ఇచ్చి ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాడు నిఖిల్.

‘కార్తికేయ2’ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై విశ్వనాథ్, వివేక్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా… ‘కార్తికేయ’ క్లయిమాక్స్ లో హీరోయిన్ తో హీరోకి వివాహం అయినట్టు చూపించలేదు. దీంతో వాళ్ళు విడిపోయినట్టు ‘కార్తికేయ2’ లో చూపించబోతున్నాడు దర్శకుడు చందూ మొండేటి అంటూ వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే… ‘కార్తికేయ2’ లో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ సెలెక్ట్ చేసారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ మాజీ లవర్ గా కలర్స్ స్వాతి కనిపించబోతుందట.

పెళ్ళైన తర్వాత సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్న స్వాతి ఈ చిత్రంతో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అని ప్రచారం జరుగుతుంది. దర్శకుడు చందూ మొండేటి గత చిత్రమైన ‘సవ్యసాచి’ బాగా ఆడలేదు. మరి ఈ చిత్రంతో హిట్ అందుకుని మళ్ళీ ఫామ్లోకి వస్తాడేమో చూడాలి..!

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus