వరుణ్, సాయి ధరమ్ తేజ్ సినిమాల మధ్య పోటీ

  • January 25, 2018 / 09:06 AM IST

మెగా కుటుంబం నుంచి ఎక్కువమంది హీరోలున్నారు. అయినప్పటికీ పక్కా ప్లానింగ్ తో తమ సినిమాల పోటీ రాకుండా రిలీజ్ చేస్తూ వచ్చారు. అయితే తొలిసారి మెగా హీరోలు పోటీకి సై అన్నారు. బావ బామర్ధులైన వరుణ్, సాయి ధరమ్ తేజ్ ల సినిమాలు ఒకే రోజు రిలీజ్ కానున్నాయి. వరుణ్ తేజ్ కి ఫిదా ఇచ్చిన ఉత్సాహంతో వెంకీ అట్లూరి దర్శకత్వంలో “తొలి ప్రేమ” సినిమా చేశారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా కొత్తగా కనిపించనుంది. యువతను ఆకర్షిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 9న రిలీజ్ కానున్నట్లు స్పష్టం చేశారు. మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.

వి వి వినాయక్ దర్శకత్వం లో చేసిన ఇంటిలిజెంట్ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని చిత్ర బృందం తెలిపింది. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మించిన ఈ మూవీని కూడా ఫిబ్రవరి 9 న విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ రెండు సినిమాలకు థమన్ సంగీతాన్ని అందించడం విశేషం. ఇందులో ఏ సినిమా మెగా అభిమానులను ఆకట్టుకుంటుందో ఆసక్తికరంగా మారింది. రెండు వేరు వేరు జానర్ లో రూపుదిద్దుకున్నాయి కాబట్టి పోటీ ఉండదని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus