‘శివాయ్’ పోస్టర్ తెచ్చిన వివాదం..!

  • May 27, 2016 / 01:35 PM IST

అజయ్ దేవ్ గణ్, సయేషా సైగల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘శివాయ్’. అజయ్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను అజయ్ విడుదల చేశాడు. ఇప్పుడు ఈ పోస్టర్లు అజయ్ కు చిక్కులు తెచ్చిపెట్టాయి. మంచు కొండల పైనుంచి కిందకు వేలాడుతున్నట్లు అజయ్ ఉండగా.. వెనుక భాగంలో మంచుతో శివుడి విగ్రహం, పక్కన దుష్ట శక్తులు ఉన్నట్లు ఈ పోస్టర్ రూపొందించబడింది.

ఈ పోస్టర్ లో తన షూతో అజయ్ శివుడి విగ్రహం పైకి ఎక్కుతున్నట్లు ఉందంటూ, ఇది హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందంటూ .. పలువురు వ్యక్తులు ఢిల్లీ లోని తిలక్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  కాగా ఈ చిత్రం అక్టోబర్ 28,2016 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus