Jhansi: శ్రీలీల కోసం మినిస్టర్ స్పీచ్ ఆపుతారా అంటూ ఫైర్ అవుతున్న సోషల్ మీడియా!

నిన్న హైదరాబాద్ లో “సీత” అనే మహిళా సాధికారిక యాప్ లాంచ్ ఈవెంట్ జరిగింది. మహిళలు తమ స్కిల్స్ ను ఆ యాప్ లో అప్డేట్ చేస్తే, వాళ్లు ఏ రంగంలో రాణించగలో సదరు యాప్ బృందం వాళ్లని గైడ్ చేస్తుంది. అది సొంతంగా క్రియేట్ చేయాలనుకునే బిజినెస్ అయినా కూడా. ఇంత మంచి యాప్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా తెలంగాణ మినిస్టర్ శ్రీధర్ బాబు, శ్రీలీల (Sreeleela), హరీష్ శంకర్, ఝాన్సీ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Jhansi

ఈ ఈవెంట్ కి సీనియర్ యాంకర్ ఝాన్సీ (Jhansi) హోస్ట్ గా వ్యవహరించారు. చాలా హుందాగా మొదలైన ఈ కార్యక్రమంలో అనుకోకుండా దొర్లిన ఒక తప్పు కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు కోపం తెప్పించింది. అదేంటంటే.. నిన్నటి ఈవెంట్లో సభను ఉద్దేశించి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతుండగా, ఆయన స్పీచ్ ను మధ్యలో ఆపి మరీ యాంకర్ ఝాన్సీ కింద కూర్చుని ఉన్న శ్రీలీలను స్టేజ్ మీదకి పిలిచింది.

అంతే.. శ్రీలీల కోసం శ్రీధర్ బాబు స్పీచ్ మధ్యలో ఆపుతారా? రాజకీయ నాయకులు అంటే కనీస స్థాయి రెస్పెక్ట్ లేదా? శ్రీలీల ఏమైనా లెజెండా? యాంకర్ ఝాన్సీకి (Jhansi) ఈ మాత్రం తెలియదా? అంటూ సోషల్ మీడియా సాక్షిగా అందరూ నిప్పులు చెరగడం మొదలెట్టారు. అయితే.. అక్కడ ఈవెంట్ లో ఝాన్సీ ముందుగా శ్రీధర్ బాబు స్పీచ్ ఆపినందుకు ఆయనకు క్షమాపణలు చెప్పి, యాప్ లాంచ్ చేయాల్సిన శ్రీలీల కూడా స్టేజ్ మీద ఉండాలి అంటూ మైక్ లో ఎనౌన్స్ చేసి పక్కకు వెళ్లిపోయింది.

ఆ విషయాన్ని శ్రీధర్ బాబు కూడా పట్టించుకోలేదు. ప్రోటోకాల్ ను బ్రేక్ చేసిన మాట వాస్తవమే అయినప్పటికీ.. శ్రీధర్ బాబును కావాలని ఝాన్సీ కానీ శ్రీలీల కానీ అగౌరవపరిచారు అనడం మాత్రం సమంజసం కాదు. అయితే.. ఇదంతా ఎవరు ఆలోచిస్తారు చెప్పండి, అందుకే సోషల్ మీడియాలో ఝాన్సీ & శ్రీలీల మీద ఫైర్ అవుతున్నారు.

బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus