దర్శకుడు తేజపై క్రిమినల్ కేసు!

  • April 27, 2016 / 11:03 AM IST

ప్రముఖ సినీ దర్శకుడు తేజపై క్రిమినల్ కేసు నమోదు అయింది.ఆయనతో పాటు వడ్డెర సత్యం, కైసర్ గ్యాంగు నుంచి తనకు ప్రాణ హాని ఉందని కలప వ్యాపారం చేసుకునే ఆర్.వి.కృష్ణారావు అనే వ్యక్తి బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈయన ఫిలిం నగర్ రోడ్డు నెంబరు తొమ్మిదిలో కలప వ్యాపారం చేస్తుంటారు.

తేజ ఇంటి విషయంపై తొందరగా తేల్చుకోవాలని లేకుంటే సత్యం, కైసర్ గ్యాంగ్ రంగంలోకి వస్తాయని విక్కి అనే వ్యక్తి తనను హెచ్చరించాడని ఆయన ఆరోపించారు. కేసు హైకోర్టులో పెండింగులో ఉన్న విషయంపై త్వరగా సెటిల్ చేసుకోవాలని కోరారట. ఈ నెల పదమూడున తేజ కూడా ఫోన్ చేసి దూషించారని ఆయన ఆరోపిస్తున్నారు.దాంతో ఈ ముగ్గురి నుంచి తనకు ప్రాణ హాని ఉందని పోలీసులకు కృష్ణారావు ఫిర్యాదు చేశారు.ఆ తర్వాత కోర్టు సలహా తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

https://youtu.be/G3KC6BA5w4M

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus