ఆ విషయంలో దేవికి కంగారేమీ లేదు!

Advertisement

“కుమారి 21 ఎఫ్” సినిమా సక్సెస్ మీట్ లో.. దేవిశ్రీప్రసాద్ ను హీరోగా పరిచయం చేస్తాను అని దర్శకుడు సుకుమార్ ఎనౌన్స్ చేసినదగ్గర్నుంచి “దేవి ఎప్పుడు హీరో అవుతాడు” అని ఎదురుచూస్తున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ఆ సినిమాలో దేవి సరసన కథానాయికగా ఎవరు నటిస్తారు? దేవి పాత్ర ఎలా ఉండబోతోంది? అని చాలా మంది ఇప్పటికే తెగ ఆలోచించేస్తున్నారు.

కానీ.. దేవిశ్రీప్రసాద్ మాత్రం అస్సలు ఆ విషయం గురించి ఏం పట్టించుకోవట్లేదంట. ప్రస్తుతం అతగాడి దృష్టి మొత్తం తన చేతిలో ఉన్న చిరు 150వ సినిమా మరియు బాలకృష్ణ 100వ సినిమా పైనే ఉన్నాయట. ఈ రెండు సినిమాలు సదరు హీరోలకు మాత్రమే కాక చిత్ర పరిశ్రమకూ మరియు ఆ హీరోల అభిమానులకు చాలా కీలకం.

అందుకే.. ప్రస్తుతానికి తాను హీరో అవ్వాలన్న ఆలోచనను పక్కన పెట్టి, ఆ రెండు సినిమాలకు ఎప్పటికీ గుర్తుండిపోయే స్థాయిలో బాణీలు అందించాలన్న తపనతో ఆహరహం శ్రమిస్తున్నాడట!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus