ప్రతి దర్శకుడికీ ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. దాని కోసం ఎన్నో ఏళ్లుగా మాట్లాడుతుంటారు. ఆ సినిమా పనులు బ్యాక్లైన్ జరుగుతూనే ఉంటాయి. రాజమౌళికి ‘మహాభారతం’లా, పూరి జగన్నాథ్కి ‘జన గణ మన’లా అన్నమాట. అలా శంకర్కి కూడా ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. దీని కోసం ఆయన ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ‘భారతీయుడు 2’, ‘గేమ్ ఛేంజర్’ సినిమాల దారుణమైన ఫలితాల తర్వాత శంకర్ కామ్ అయిపోయారు. అయితే అది సైలెన్స్ కాదని.. తన భారీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వేల్పారి’ కోసం రెడీ అవుతున్నారని సమాచారం.
కోడంబాక్కం వర్గాల సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాకు రూ.1000 కోట్ల నుండి రూ.1500 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందట. ఈ సినిమా వెంకటేశన్ రాసిన ‘వీర యుగ నాయకన్ వేల్పారి’ అనే నవల ఆధారంగా తెరకెక్కిస్తారట. వేల్పారి వీరత్వం, చోళ, పాండ్య రాజులతో ఆయన చేసిన పోరాటాన్ని ఈ సినిమాలో చూపిస్తారని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. మల్టీ స్టారర్గా మూవీగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్లో స్టార్ హీరో ధనుష్ని ముఖ్య పాత్ర కోసం సంప్రదించారని టాక్.
ఈ సినిమా కోసం ధనుష్ దాదాపు రెండేళ్లు డేట్స్ శంకర్ అడిగినట్లు సమాచారం. ఈ పాయింట్ దగ్గరే ప్రాజెక్ట్ హోల్డ్లో పడింది అని చెబుతున్నారు. ఎందుకంటే మూడు, నాలుగు నెలలకు ఒక సినిమా ఇచ్చేసే రకం ధనుష్. అలాంటి ఆయన రెండేళ్ల డేట్స్ ఇవ్వడం అంటే పెద్ద విషయమే. మరి ఆయన నిర్ణయం ఏంటి అనేది చూడాలి. ఇక ఇదే సినిమాలో మరో హీరో పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ను అడిగారట. తొలుత ఆ పాత్ర కోసం రణ్వీర్ సింగ్ని అడిగారని టాక్ వచ్చింది.
ధనుష్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. విఘ్నేశ్ రాజా ‘కర’ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. వచ్చే నెల 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత ‘అమరన్’ సినిమా ఫేం రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ధనుష్. ‘లబ్బర్ పందు’ దర్శకుడు తమిళరసన్ డైరక్షన్లో మరో సినిమా ఉండనుంది.