ఆ బయోపిక్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ధనుష్?

  • December 15, 2020 / 04:32 PM IST

క్రీడాకారులకు సంబంధించిన బయోపిక్స్ ఇటీవల చాలానే వచ్చాయి భవిష్యత్తులో మరిన్ని రాబోతున్నాయి కూడా. ఎమోషన్ కనెక్ట్ అయ్యిందంటే చాలు ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అగ్ర తారలు కూడా స్పోర్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేయడాన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నారు. ఇక త్వరలో చదరంగం మాంత్రికుడు విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్ కూడా తెరపైకి రానున్నట్లు సమాచారం. బాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన ఆనంద్ ఎల్ రాయ్ ఆ బయోపిక్ ను పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

ముఖ్యంగా ఆ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ అయితే ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ బయోపిక్ లో విశ్వనాథన్ ఆనంద్ గా కోలీవుడ్ హీరో ధనుష్ నటించనున్నట్లు టాక్ వస్తోంది. ఇటీవల ధనుష్ తో దర్శకుడు చర్చలు జరిపినట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఆల్ మోస్ట్ పూర్తయ్యాయని తెలుస్తోంది. చెస్ ఆటగాడిగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకొని భారత్ తరపున పలు అగ్ర దేశాలతో పోటీపడిన ఆనంద్ అంటే తెలియని వారు ఉండరు.

చెస్ ఆటలో ఎన్నో ట్రోపిస్ కూడా అందుకున్నారు. ఇక అలాంటి చెస్ మాస్టర్ కథను వెండితెరపై ఎలా ప్రజెంట్ చేస్తారో చూడాలి.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus