అల్లు అర్జున్ తో సినిమాపై పరశురామ్ కామెంట్

  • August 9, 2018 / 06:42 AM IST

పూరి జగన్నాథ్ వద్ద అనేక సినిమాలకు పనిచేసిన పరశురామ్ “యువత” సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. “సోలో” సినిమాతో ఫ్యామిలీ చిత్రాలను చక్కగా తెరకెక్కించగలరని నిరూపించుకున్నారు. “శ్రీరస్తు శుభమస్తు” సినిమాలో అల్లు శిరీష్ ని చక్కగా చూపించి మంచి పేరు తెచ్చుకున్నారు. గీతా ఆర్ట్స్ లోనే మరో ఛాన్స్ అందుకున్నారు. విజయ్ దేవరకొండతో “గీత గోవిందం” సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ నుంచి విశేషంగా ఆకట్టుకుంటోంది. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆగష్టు 15 న రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమా హిట్ అయితే పరశురామ్ కి బన్నీ అవకాశం ఇస్తాడని పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఈ విషయాన్ని పరశురామ్ ని అడగగా ఇలా స్పందించారు. బన్నీతో సినిమా చేయాలనే ఆలోచన తనకి ఉందని, రెండు మూడు లైన్లు కూడా ఉన్నాయని, కానీ ఆ ప్రాజెక్ట్ సెట్ కావాలంటే అన్నీ కుదరాలని వెల్లడించారు. “నేను చెప్పే కథలంటే బన్నీకి చాలా ఇష్టం. తనకు బోర్ కొట్టినప్పుడల్లా నాతో కథలు చెప్పించుకుంటారు. అలా మేమిద్దం ఎప్పటికప్పుడు స్టోరీ డిస్కషన్స్ చేస్తూనే ఉంటాం. గీత గోవిందం” కథను కూడా మొదట బన్నీకే చెప్పాను. అతనికి కథ బాగా నచ్చింది. ” అన్నారు. కానీ బన్నీ ఒక్కసారి కూడా తన కథల్లో నటిస్తానని చెప్పలేదని స్పష్టం చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus