ఈసారైనా సంపత్ నంది ఆ విషయంలో సక్సెస్ అవుతాడా…?

  • August 19, 2020 / 11:40 AM IST

‘ఏమైంది ఈ వేళ’ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమయ్యి మొదటి చిత్రంతోనే హిట్ అందుకున్నాడు సంపత్ నంది. ఆ వెంటనే మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ‘రచ్చ’ అనే చిత్రాన్ని తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు. దాంతో పవన్ కళ్యాణ్ పిలిచి మరీ ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ ను తెరకెక్కించే ఛాన్స్ ఇచ్చాడు. కానీ పవన్ కు సంపత్ రెడీ చేసిన స్క్రిప్ట్ నచ్చకో ఏమో కానీ.. గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తరువాత ఆ ప్రాజెక్ట్ నుండీ సంపత్ నంది బయటకు వచ్చేసి..

‘బెంగాల్ టైగర్’ చేసాడు. ఆ చిత్రం బాగానే ఆడింది. అయితే తరువాత గోపీచంద్ తో చేసిన ‘గౌతమ్ నంద’ ప్లాప్ అయ్యింది.ఈ రెండు సినిమాలకు ముందే నిర్మాతగా కూడా మారి ‘గాలి పటం’ అనే యూత్ ఫుల్ చిత్రాన్ని రూపొందించాడు. అటు తరువాత ‘పేపర్ బాయ్’ చిత్రాన్ని కూడా రూపొందించాడు. కానీ ఈ రెండు సినిమాలు ఆడలేదు.అయినప్పటికీ ఇప్పుడు మరో చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యాడు. అయితే ఈసారి సహా నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తున్నాడు.

కానీ కథ మాత్రం సంపత్ నందిదే..! తన శిష్యుడు అశోక్ తేజని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించనున్నాడు. రెండు సార్లు సంపత్ నంది నిర్మాతగా ఫెయిల్ అయ్యాడు. మరి ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి…!

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus