‘సాహో’ పై ఉన్న అంచనాల్ని నేను మ్యాచ్ చేయలేకపోయాను

  • August 31, 2019 / 05:23 PM IST

సుజిత్… ఈ పేరు గత కొన్ని రోజులుగా ఇండియా వైడ్ హల్ చల్ చేస్తుంది. ఈ కుర్ర డైరెక్టర్ కేవలం శర్వానంద్ తో ‘రన్ రాజా రన్’ అనే చిత్రం మాత్రమే చేసాడు. ఆ సినిమా మంచి హిట్టైంది. దీంతో ఏకంగా ‘బాహుబలి’ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఈ చిత్రం కోసం ఏకంగా 350 కోట్ల బడ్జెట్ పెట్టారు ‘యూవీ క్రియేషన్స్’ వారు. ఇది హీరోతో పాటు నిర్మాతలకు కూడా పెద్ద సాహసమే…! ప్యాన్ ఇండియా చిత్రంగా … తెలుగు ,తమిళ , మలయాళం , హిందీ భాషల్లో ఏకకాలంలో 10 వేలకి పైగా థియేటర్లలో విడుదల చేశారు.

ఆగష్టు 30 న(నిన్న) విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే డివైడ్ టాక్ ను మూట కట్టుకుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సినిమాపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం విశేషం. ప్రభాస్ బెస్ట్ ఇచ్చాడు.. అందులో డౌట్ లేదు. ఇక నిర్మాతలు కూడా మంచి నీళ్ళులా ఖర్చుపెట్టేసారు. సో వాళ్ళు కూడా బెస్ట్ ఇచ్చారు… కానీ డైరెక్టర్ సుజీత్ విషయంలోనే భారీ విమర్శలు వస్తున్నాయి. ‘సినిమా అంటే కేవలం భారీ యాక్షన్ సీక్వెన్సులు అనేలా తీసి , కథ, కథనాల్ని గాలికి వదిలేసాడని’ చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఈ విషయం పై తాజాగా సుజిత్ స్పందించాడు .. ‘రెండేళ్ళ పాటు ఎంతో కష్టపడి తీసిన సినిమాకి ఈ విధమైన టాక్ రావడం నాకు చాలా భాధగా ఉంది. సినిమాలో ప్రభాస్ అన్న నటన సూపర్ గా ఉంది. అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. కానీ, అభిమానులు ప్రభాస్ అన్న నుండీ ఇంకా ఎదో ఎక్సఫెక్ట్ చేసారు. దాన్ని నేను రీచ్ కాలేకపోయాను … నన్ను నమ్మి రెండేళ్ళు కష్టపడ్డ ప్రభాస్ అన్నకి నేను ఎప్పుడూ ఋణపడి ఉంటాను’ అంటూ చప్పుకొచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus